కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏడాది గడిచినా ఆరు గ్యారంటీలకు బదులుగా, ఆరు మోసాలు 66 అబద్ధాలు అన్నట్లుగా పాలన సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఒడ్డేకేదాక ఓడ మల్లన్న.. ఒడ్డెక్కాక బోడ మల్లన్న అనేలా రేవంత్ మాటలు ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక నెరవేర్చడం లేదని విమర్శించారు. ఆటో డ్రైవర్లకు రూ. 12వేలు దేవుడెరుగు, కాంగ్రెస్ పాలనలో 50 మంది ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకున్నారన్నారు.
