తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలన విజయ ఉత్సవాలపై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఇకపై సీఎం రేవంత్ రెడ్డి మోసాలను ఉపేక్షించబోమని.. మంత్రులు, ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తామన్నారు.
