ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా రూ. 21వేల కోట్ల రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే మేమంతా వచ్చి క్షమాపణ చెబుతామన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని నల్లగొండ గడ్డ నుంచి రాష్ట్ర రైతాంగానికి హామీ ఇస్తున్నానన్నారు. సన్నాలు పండిస్తే బోనస్ ఇచ్చి తీరుతామన్నారు.
