తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్ను ఆహ్వానించాం. అందరినీ గౌరవించాలన్నది మా పార్టీ విధానం,” అని తెలిపారు. సమావేశం అనధికారికంగా కొనసాగిందని, రాజకీయ అంశాలపై చర్చించలేదని మంత్రి వెల్లడించారు. “లంచ్ టైమ్ కావడంతో కేసీఆర్ గారు భోజనానికి ఆహ్వానించారు,” అని పేర్కొన్నారు.
