తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం చార్మినార్లో సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం వారు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్థానిక నేతలు ఉన్నారు.
