ఆస్ట్రేలియాలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. రెండోరోజు ఆట ముగిసేసరికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. పంత్(28), నితీశ్(15) క్రీజ్లో ఉన్నారు. స్కాట్ 2, పాట్ కమిన్స్ 2, మిచెల్ స్టార్క్ 1 వికెట్ తీశారు. భారత్ 29 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్ల్లో భారత్ 180, ఆస్ట్రేలియా 337 పరుగులకు ఆలౌటయ్యాయి.
