యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామం పరిధిలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. జలాల్పూర్ చెరువులోకి కారు దూసుకెళ్లి, అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో మృతులుగా గుర్తింపు పొందిన వారు హైదరాబాద్ హయత్నగర్ కు చెందిన వంశీగౌడ్, దినేష్, హర్ష, బాలు, వినయ్ అనే వ్యక్తులు. కాగా, ఈ ప్రమాదంలో ప్రాణాలతో మణికంఠ అనే యువకుడు బయటపడ్డడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
