ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ హబ్గా ఎదుగుతోందని సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన డీప్టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, రాష్ట్రంలోని ఐటీ రంగం, నాలెడ్జ్ ఎకానమీపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ, భారత ఐటీ నిపుణుల్లో 30 శాతం తెలుగువారు ఉన్నారని, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు యువత ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతున్నారని పేర్కొన్నారు. నూతన టెక్నాలజీలు, ఆవిష్కరణలతో యువత ప్రపంచ స్థాయిలో నిలుస్తున్నారని, దీన్ని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో వివిధ పరిశ్రమల ప్రతినిధులు, టెక్నాలజీ నిపుణులు, యువత భారీగా పాల్గొన్నారు. విశాఖపట్నంను డిజిటల్ ఇన్నోవేషన్ కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ఈ కాంక్లేవ్ మైలురాయిగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.