హైదరాబాద్ నగరంలో కాలుష్యం, ట్రాఫిక్ వంటి సమస్యలు పెరిగిపోతున్నాయని, వాటికి పరిష్కారం కోసం ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్స్గా నియమించే ఆలోచనను అధికారులకు సూచించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు 50 మంది ట్రాన్స్జెండర్లకు అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడమైనది.
అదేవిధంగా, ఐపీఎస్ అధికారులు ప్రమాదాల్లో చనిపోయే పరిస్థితిలో, వారి కుటుంబానికి రూ.2 కోట్ల ఆర్థిక సహాయం అందించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నట్లు తెలిపారు.