నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో చిరుత కలకలం రేచింది. ఆలయం వెనుక ఉన్న మాడ వీధుల్లో చిరుత సంచరిస్తుండగా దాన్ని చూసిన భక్తులు భయంతో కేకలు వేయటంతో ఆ చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనను చూసిన భక్తులు దేవస్థానం కౌంటర్లో ఫిర్యాదు చేశారు. అయితే, ఆలయ అధికారులు మరియు అటవీ అధికారులు ఈ విషయం గురించి పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
