హీరో ప్రభాస్.. దర్శకుడు మారుతి కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రాజాసాబ్’. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కథానాయికలు. ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. దీంట్లో ఓ ప్రత్యేక గీతం ఉండనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పాటలో ప్రభాస్తో కలిసి నయనతార ఆడిపాడనున్నట్లు సమాచారం.
