ఆర్టీసీ క్రాస్ రోడ్స్ బావర్చి హోటల్లో ఓ కస్టమర్కు వడ్డించిన బిర్యానీలో టాబ్లెట్లు రావడం సంచలనంగా మారింది. బిర్యానీలో టాబ్లెట్ రావడంతో హోటల్ యాజమాన్యాన్ని నిలదీశాడు కస్టమర్. అయితే, యాజమాన్యం కస్టమర్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా.. టాబ్లెట్ తీసేసి తినమని ఉచిత సలహా ఇచ్చింది. దీంతో సదరు కస్టమర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో ఆ కస్టమర్ బిర్యానీలో వచ్చిన టాబ్లెట్కు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ అయ్యింది.
