రఘు రామకృష్ణ రాజు కేబినెట్ ర్యాంకు హోదా కల్పిస్తూ ఈరోజు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గవర్నమెంట్ పొలిటికల్ సెక్రెటరీ సురేష్ కుమార్ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ గా ఆ పదవిలో ఉన్నంత కాలం.. ఆయనకు కేబి నెట్ ర్యాంకుకు అనుగుణంగా ప్రొటోకాల్, భద్రతా పరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు.
