శ్రీవారి ఆలయం నుంచి పద్మావతి అమ్మవారికి సారె

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె స‌మ‌ర్పించారు. ప్రతి ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. కాగా ఈ సారెను గజాలపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి పాండ్యన్ కిరీటం, లక్ష్మీ పతకం, డైమెండ్ నెక్లెస్, వజ్రాల గాజులు, వజ్రాలు పొదిగిన కమ్మలను దాదాపు మూడు కేజీలకు పైగా రూ. 1.11 కోట్లు విలువైన నగలను అమ్మవారికి సమర్పించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News