భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు అడిలైడ్ వేదికగా జరుగుతోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో భారత్ తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకు ఆలౌట్ అయింది. నితీశ్ కుమార్ రెడ్డి (42) టాప్ స్కోరర్ కాగా.. స్టార్క్ ఆరు వికెట్లు తీశాడు. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆసీస్ 24 పరుగుల వద్ద ఉస్మాన్ ఖవాజా మొదటి వికెట్ కోల్పోయింది.
