తెలంగాణ ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా దళిత సంక్షేమం కోసం ‘దళిత బంధు’ పథకానికి నియోజకవర్గానికి 11 వందల మంది చొప్పున 5500 మందికి దళిత బంధు పథకానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు తెలంగాణ భవన్ లో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో కేటీఆర్ నివాళులు అర్పించి మాట్లాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాం వద్ధ ఏలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఎందుకు అవమానిస్తుందని నిలదీశారు.
అంతేగాక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏడాది కాలమైనా.. దళిత బంధు లేదు, అభయహస్తమూ లేదని, దళిత బంధు అడిగితే దళితులపై కేసులు పెడుతున్నారని ఇదేనా.. అంబేద్కర్కు మీరిచ్చే నివాళి? అని బీఆరెఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ KTR ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.