అంగరంగ వైభవంగా.. తలసాని సోదరుడి కుమార్తె వివాహం

మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు మహేష్ యాదవ్ కుమార్తె వివాహం బుధవారం రాత్రి కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు, బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులు వైష్ణవి, గిరిధర్ దంపతులను ఆశీర్వదించారు.

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, PAC చైర్మన్ అరికేపూడి గాంధీ, MLA లు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, ముఠా గోపాల్, దానం నాగేందర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, వివేక్, మాధవరం కృష్ణారావు, మాజీమంత్రులు మహమూద్ అలీ, గంగుల కమలాకర్, కడప జిల్లా మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్, పలువురు మాజీ కార్పోరేషన్ చైర్మన లు, కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు తదితరులు వివాహానికి హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News