ఇండోర్ ఎమరాల్డ్ హై స్కూల్ గ్రౌండ్లో జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టు సంచలనం సృష్టించింది. సిక్కిం జట్టుతో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బరోడా టీమ్ 20 ఓవర్లలో ఏకంగా 349/5 పరుగులు చేసింది. జింబాబ్వే (గాంబియాపై 344/4) పేరిట ఉన్నరికార్డును చెరిపేసింది. కాగా 350 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన సిక్కిం 86/7 పరుగులే చేసింది.