రైల్వే సమస్యలను పరిష్కరించండి

న్యూఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో మాట్లాడారు. కాగా లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రైల్వే సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఏపీలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగళూరు, రేణిగుంట-గూడూరు, కోటిపల్లి-నర్సాపూర్‌ లైన్లను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అలాగే కొవిడ్‌ సమయంలో ఆపేసిన అనంతపురం కిసాన్‌ రైలు, రైల్వే ఛార్జీల్లో వృద్ధులు, క్రీడాకారులకు రాయితీలను పునరుద్ధరించాలని కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News