తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు ఆర్టీసీ కొత్త బస్సు డిపోలు మంజూరు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ వ్యవస్థలో 10-15 ఏళ్ల తర్వాత రెండు నూతన ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పెద్దపల్లి, ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో బస్సు డిపోలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్టీసీ ముందుకు వస్తుందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.
