మహారాష్ట్రలో ఈనెల 4న బీజేపీ శాసనసభాపక్ష నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర తదుపరి సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర పగ్గాలు అందుకోనున్నట్లు సమాచారం. ఇక ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా, డిసెంబర్ 5న మహారాష్ట్ర కొత్త cm ప్రమాణస్వీకారం జరగనున్నట్లు తెలుస్తుంది.
