హైడ్రా కు భారీగా నిధులు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైడ్రా కార్యాలయం నిర్వహణకు, వాహనాల కొనుగోలు కు ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా హైడ్రా ఏర్పాటయ్యాక జీహెచ్ఎంసీ పరిధిలోని పలు చెరువులు, కుంటలు, పార్కు స్థలాలను ఆక్రమించుకొని నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.
