సినీ నటుడు వరుణ్ తేజ్ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లారు. హనుమాన్ మాల ధరించిన ఆయన స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న ఆయన… ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వరుణ్ తేజ్ కి ప్రసాదాలు, ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ… అత్యంత శక్తిమంతుడైన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ నటించిన ‘మట్కా’ సినిమా ఇటీవల విడుదలై ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే.
