రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై డిసెంబరు 7 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ను సర్కారు విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రజాపాలన విజయోత్సవాలను చౌటుప్పల్ మున్సిపల్ అధికారులు చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఈరోజు పురపాలక సంఘం కార్యాలయం నుండి జాతీయ రహదారిపై ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ రెడ్డి రాజు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేతృత్వంలో మునుగోడు నియోజకవర్గం రాష్ట్రంలోనే ముందంజలో ఉండి అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని అన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు రేడియం జాకెట్స్, బ్లౌజులు, అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నరసింహారెడ్డి, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు సుర్వి నర్సింహా గౌడ్, పాలక వర్గం సభ్యులు వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.