కేంద్ర ఎన్నికల సంఘానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఒక్కో పోలింగ్ బూత్లో గరిష్టంగా ఓటర్ల సంఖ్యను 1,200 నుంచి 1,500లకు పెంచడాన్ని సవాలు చేస్తూ ఇందు ప్రకాశ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై సీజేఐ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ద్విసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.
ఈ మేరకు మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి (CEC) నోటీసులు జారీ చేసింది.
పోలింగ్ బూత్ లో ఓటర్ల సంఖ్యను పెంచాలనే నిర్ణయం పూర్తిగా ఏకపక్షమని, ఏ నివేదికల ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆ నిర్ణయం తీసుకుందో కోర్టుకు చెప్పాలని ప్రకాశ్ సింగ్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తన వాదనలు వినిపించారు.