సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్లో రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన కోకాకోలా కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రులతో కలిసి కంపెనీ ప్రాంగణంలో తిరిగారు. ఈ మేరకు కంపెనీలో పలు వివరాలను తెలుసుకున్నారు. కాగా, ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గజ్వేల్ ప్రాంతంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తు్న్న విషయం తెలిసిందే.
