శబరిమలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే శబరిమలలోని సన్నిధానం, పంబ, నిలక్కల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శబరిమలలో దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వర్షాల నేపథ్యంలో దేవస్థానం బోర్డు అప్రమత్తమయింది. త్వరగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది.
