ఈశాన్య రుతుపవనాల కారణంగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగండం ఫెంగల్ తుఫానుగా మారి మరికొన్ని గంటల్లో తీరం దాటనుంది. తెలంగాణలో కూడా ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్తో వర్షాలు కురవనున్నాయి. శనివారం, ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. నాగర్కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, ఖమ్మం, భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
